తిరుమల: తిరుమలలో కిడ్నాప్కు గురైన బాలుడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడిని గుర్తించారు. అతని పోస్టర్లను తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగుళూరు, చెన్నైకి పంపించనున్నారు. చెన్నకేశువులు అనే ఏడాది బాలుడు కిడ్నాపై నేటికి 15 రోజులు దాటింది. బాలుడు ఆచూకి కోసం 10 పోలీస్ బృందాలు గత రెండు వారాలుగా గాలిస్తున్నాయి. తమ కుమారుడికి కోసం తల్లిదండ్రులు కొండపైనే ఎదురుచూస్తున్నారు.