కోజికోడ్ విమాన ప్రమాద ఘటనతో కేంద్ర విమానయాన యంత్రాంగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అప్రమత్తమైంది. అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏటా భారీ వర్షాలతో సతమతమవుతున్న ముంబయి, చెన్నై వంటి విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.