సాలూరు మండల కేంద్రంలో మంగళవారం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రతినిధి కే.రాంబాబు గత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సొమ్మును రైతులకు ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. ధాన్యం ఇచ్చిన రైతులకు నేటికీ బకాయిలు చెల్లించడం అన్యాయమన్నారు. పిఎసిఎస్ కేంద్రాలకు జిల్లా వ్యాప్తంగా తమ పంట ధాన్యాన్ని ఇచ్చిన రైతులకు వడ్డీతో సహా సొమ్ము చెల్లించాలని హెచ్చరించారు.