మందు వరుసలో ఉండి కరోనాపై పోరాడుతున్న పోలీసు శాఖలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారుల వరకు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఓ రాష్ట్ర పోలీస్ బాస్ అయిన డీజీపీకి కరోనా సోకింది. అసోం డీజీపీ భాస్కర్ జ్యోత్ మహంతాకు కరోనా పాజిటివ్ గా అధికారులు నిర్ధారించారు. దీంతో ఆ రాష్ర్ట పోలీసు శాఖ ఉలిక్కిపడింది. డీజీపీ ఆఫీసులో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. అసోంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,838కి చేరగా, మృతుల సంఖ్య 145కు చేరింది. మొత్తం పాజిటీవ్ కేసుల్లో 16,364 కేసులు యాక్టివ్లో ఉండగా, 42,326 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.