ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 3803 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్ఓఆర్సీటీ)-2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. పూర్తి వివరాలకు www.aiimsexams.org/ వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 3803
ఎయిమ్స్ న్యూఢిల్లీ - 597
భువనేశ్వర్ - 600
డియోగఢ్ - 150
ఘోరక్పూర్ - 100
జోధ్పూర్ - 176
కల్యాణి - 600
మంగళగిరి - 140
పట్నా - 200
రాయబరేలి - 594
రాయ్పూర్ - 246
రిషికేశ్ - 300
విద్యార్హత: డిప్లొమా (జీఎన్ఎమ్)/బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉచితం.
ఎంపిక విధానం: సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభ తేది: ఆగస్టు 5, 2020
దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 18, 2020 (సాయంత్రం 5 గంటల వరకు)
సీబీటీ పరీక్ష తేది: సెప్టెంబర్ 1, 2020
వెబ్సైట్:www.aiimsexams.org/
నోట్: ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనివారు కూడా అప్లై చేసుకోవచ్చు.