దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో సీఎం జగన్ ఉన్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే - కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన పోల్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రెండో స్థానంలో,ఏపీ సీఎం జగన్ మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 9వ స్థానంలో నిలిచారు. జూలై 15-27 తేదీల మధ్య దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న 97 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ సర్వే చేపట్టారు.