ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్​పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 06, 2020, 09:45 AM

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఎస్​పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం జరిగింది. బాయిలర్‌ యూనిట్‌లో వేడినీళ్లుపడి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వేడి గొట్టం నుంచి వేడి నీరు పడి లక్ష్మణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలవ్వగా.. నంద్యాల ప్రభుత్వఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పది రోజుల క్రితమే పరిశ్రమలో అమోనియమ్ గ్యాస్ లీకై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అమ్మోనియానికి అనువైన పైపును ఉపయోగించలేదని విచారణ కమిటీ సభ్యులు గుర్తించారు. కాపర్ స్టీల్ పైపు బదులుగా మైల్డ్ స్టీల్ పైపు వాడినట్లు చెప్పారు. అగ్నిప్రమాదం సంభవించినపుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని కమిటి సభ్యులు ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com