ఎన్ని చట్టాలు వచ్చినా మృగాళ్ళ ప్రవర్తన మారడం లేదు. దేశంలో దిశ చట్టంతో ఆదర్శంగా నిలిచిన ఏపీలో అమ్మాయిలు, మహిళలపై ఘోరాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ గిరిజన మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారం కలకలం రేపుతోంది. వెలుగోడులో ఓ గిరిజన వివాహితపై నలుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. భర్తను లాక్కెళ్ళి చితకబాదిన నలుగురు వ్యక్తులు ఘోరానికి పాల్పడ్డారు. భర్త ఎదుటే భార్యను లాక్కెళ్ళి బలాత్కారం చేశారు నలుగురు వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెలుగోడు మండలంలో అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘోరం గురించి తెలుసుకున్న బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. వెలుగోడు పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది.గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. మధ్యప్రదేశ్ నర్సింగ్పూర్లో ట్రక్కు బోల్తా పడి నలుగురు మృత్యువాత పడ్డారు.
ప్రమాద ఘటనలో దంపతులతో పాటు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు కృష్ణాజిల్లా విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పమిడిముక్కల మండలం గురజాడ వద్ద అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది కారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఎనిమిదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం బీచ్ కి వెళ్లి తిరిగి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు విజయవాడకు చెందిన అమర్, యూసఫ్, శివరాజ్ గా గుర్తించారు.