కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం టెన్షన్ పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా మెుదటి నుంచి కరోనాకు అడ్డగా మారిపోయింది. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అయినప్పటి నుంచి అత్యధిక కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కర్నూలు పట్టణం, నంద్యాల, ఆదోనిలలో కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటం ఆ ప్రాంత వాసులను కలవర పెడుతుంది.తాజాగా నంద్యాల పట్టణంలో మెుత్తం కేసులు 3వేలకు పైగా నమోదు అయ్యాయి. నంద్యాల పట్టణంలో కరోనా కేసులు 3వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో నంద్యాలలో కొత్తగా 168 కేసులు నమోదు అయ్యాయి. దాంతో నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3168కు పెరిగాయి. వారిలో 1328 మంది హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. మెుత్తానికి కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా లమలు చేస్తున్నారు.