జీఎస్టీ అమలుకు వారం రోజుల ముందు పేటీఎం అదరగొట్టే ఆఫర్తో ముందుకొచ్చింది. ఫింగర్ ప్రింట్ స్కానర్లు ఉన్న స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, గూగుల్ పిక్సల్, ఒప్పో ఎఫ్ 3, వివో వీ5ఎస్, హెచ్టీసీ డిజైర్ 10 ప్రొ తదితర వాటిపై 10వేల రూపాయల క్యాష్బ్యాక్ ప్రకటించింది. ఈ ఆఫర్ పొందేందుకు ఆయా ఫోన్లు కొనుగోలుకు ముందు ప్రమోషనల్ కోడ్ను ఉపయోగించాల్సి ఉంటుందని పేటీఎం తెలిపింది. అయితే ప్రోమో కోడ్స్ ఉపయోగిస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదని, ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తుపెట్టుకోవాలని తెలిపింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ రేపటి (ఆదివారం) వరకు కొనసాగుతుంది.