కోయంబత్తూర్ : తమిళనాడు శాసనసభలో విశ్వాసపరీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి పళనిస్వామికి ఓటు వేసినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని దక్షిణ కోయంబత్తూర్ నియోజక వర్గం ఎమ్మెల్యే అమ్మాన్ కె. అర్జునన్ అన్నారు. తనను తన భార్యను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అన్నం తింటున్నావా, మరేదైనా తింటున్నావా అంటూ దూషిస్తున్నారని ఆయన అన్నారు. ఈ అంశంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.