ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో నిర్వహించిన నెట్ సెషన్లో పాల్గొన్నారు. విండీస్ పర్యటనకు రోహిత్ శర్మ దూరం కావడంతో ఓపెనర్ శిఖర్ధావన్కి జోడీగా రహానె బరిలోకి దిగుతాడని సారథి కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ధావన్, రహానె, ధోనీ, పాండ్య, రిషబ్పంత్ తదితర భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచుల్లో భారత్ పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మరో పక్క విండీస్ ఆటగాళ్లు కోచ్ ఆధ్వర్యంలో నెట్ సెషన్లో పాల్గొన్నారు.క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో కోహ్లీ సేన ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత శిబిరానికి వెస్టిండీస్ ఆటగాళ్లు డారెన్ బ్రావో, డ్వేన్ బ్రావో సందర్శించారు. టీమిండియా సారథి కోహ్లీకి డ్వేన్ బ్రావో మంచి సన్నిహితుడు. శిబిరానికి చేరుకున్న బ్రావో సోదరులు ధోనీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యతో తమ అనుభవాలను పంచుకుంటూ సందడి చేశారు.