ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్డీయే అభ్యర్థి కోవింద్ ఖాతాలో ఇప్పటికే 63.1శాతం మేర ఓట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 23, 2017, 10:54 AM

రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయకుండా ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ను ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌పై పోటీకి నిలిపినా... అధికార పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్‌దే విజయం తథ్యమని తెలుస్తోంది. ఎన్డీయే అభ్యర్థి కోవింద్ ఖాతాలో ఇప్పటికే 63.1శాతం మేర ఓట్లు ఎలక్టోరల్ కాలేజ్ నుంచి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు 10, 98,903. ఇందులో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే పక్షాల ఓట్ల విలువ 48.9శాతంగా ఉండగా, ఇతర పార్టీలైన జేడీయూ (1.91శాతం), అన్నాడీఎంకేకు చెందిన ఇరు శిబిరాలు (5.39శాతం), టిఆర్ఎస్ (2శాతం), వైఎస్సార్సీపీ (1.53శాతం), ఐఎన్‌ఎల్డీ (0.38శాతం), ఓట్ల విలువ కలిపితే కోవింద్ ఖాతాలో 63.1శాతం ఓట్లు ఉన్నాయి.


దళితుల ఓటుబ్యాంకు సొంతం చేసుకునేందుకు ఎన్డీయే ఆ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపిందని శివసేన ఆరోపించింది. శివసేనకు ఎలక్టోరల్ కాలేజీలో 2.34శాతం ఓట్లున్నాయి. అయితే ఆ పార్టీ ఎవరికి మద్దతునిస్తుందని స్పష్టంగా తెలియకపోయినా ఎన్డీయే పాత మిత్రుడు కాబట్టి.. కోవింద్ కే తన మద్దతు లభించే అవకాశం ఉంది.అటు సమాజ్ వాదీ పార్టీ ఎవరికి ఓటేస్తుందో వెల్లడించలేదు. బీఎస్పీ తొలుత కోవింద్ కే జైకొట్టినా.. బిహార్ కు చెందిన దళిత సామాజిక వర్గానికి మీరాకుమార్ ను ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడంతో మాయావతి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తమ ఓటు మీరాకుమార్ కేనని వెల్లడించారు.శుక్రవారం కోవింద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహసంగా జరుగనున్న ఈ కార్యక్రమానికి పలువురు నేతలు హాజరుకానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com