ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు: ఆ పట్టణంలో మరోసారి లాక్ డౌన్..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 05:08 PM

కర్నూలు జిల్లా అదోనిలో ఆదివారం నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. కార్వాన్ పేట, కంచిగారివీధి, క్రాంతినగర్, విక్టోరియా పేటలలో ఒక్కొక్కటి చొప్పున  పాజిటివ్   కేసులు బయటపడ్డాయి. ఇప్పటికీ నియోజకవర్గ పరిధిలో కరోనా కేసుల సంఖ్య 524కు చేరుకున్నాయి.  అందులో 227 మంది కొలుకోగా 20 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప బయటకు రావ‌ద్ద‌ని, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారుఆదోని పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం అమలు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుబ్బారావు ఆదివారం తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు యధావిధిగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే కిరాణా, కూరగాయలు ఇతర నిత్యావసర సరుకుల అమ్మకునేందుకు అనుమతి ఉంటుందన్నారు. ప్రజలు గమనించి ఆ సమయంలోనే బయటకు రావాలని, అనవసరంగా బ‌య‌ట‌కు రాకుండా సహకరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com