కరోనా కష్టకాలం అనేక మందిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జులై 5 వచ్చినా ఇంకా జీతాలు రాలేదు. జులై 2న గవర్నర్ విశ్వభూషణ్ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడంతో శనివారం జీతాలు వస్తాయని అంతా భావించారు. దీంతో ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు పెట్టేందుకు అవకాశం వచ్చింది. ఆ డబ్బులను 4వ తేదీన జమ చేస్తారని అంతా ఎదురుచూశారు. కానీ 4న జీతాలు జమ కాలేదు. చూస్తుండగానే ఆదివారం కూడా వచ్చేసింది. అయితే సోమవారం తప్పకుండా జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని ప్రభుత్వ వర్గాలు సంకేతాలిచ్చాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేపు ప్రభుత్వం తమకు గుడ్ న్యూస్ చెబుతుందని వారు భవిస్తున్నారు.