ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావుకు కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచించారు. వీలైనంత వరకు ఇతరులతో కలిసి కారులో ప్రయాణించకూడదని వీడియో సందేశంలో పేర్కొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా మాణిక్యాలరావు పనిచేశారు. తాడేపల్లి గూడెం మున్సిపాలిటీ మాజీ చైర్మన్కు కరోనా వచ్చిందని, ఆ విషయం తెలియక ఆయన కారులో ప్రయాణించడంతో తనకు కరోనా సోకి ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.