భారత జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో అన్ లాక్ 2 నిబంధనలు,కరోనా మహమ్మారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు,భారత్ చైనా మధ్య నెలకొన్న భీకర పరిస్థితులకు సంబంధించి ఆయన మాట్లాడనున్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆయన వివరించనున్నారు. ఇవే కాకుండా ప్రధాని మోడీ ఇంకేం మాట్లాడనున్నారో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.