ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక పాలసీకి సంబంధించి సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయాలు తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్ల బండ్ల పై స్వంత అవసరాలకు ఉచితంగా ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తీసుకపోవచ్చని సర్కార్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ట్రాక్టర్ల ద్వారా కూడా ఉచితంగా ఇసుక తీసుకపోయేందుకు ఏపీ సర్కార్ అనుమతించింది. బలహీన వర్గాల గృహ నిర్మాణం, సహాయ, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన పనులకు ఉచితంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లానుకుంటే గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి కోరిన వారి వివరాలు నమోదు చేసుకుని, ఎలాంటి ఫీజు లేకుండా సచివాలయాలు అనుమతి పత్రం ఇస్తాయి. ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.