న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 24వ తేదీన పోర్చుగల్ వెళ్లనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి గోపాల్ బగాలే చెప్పారు. ప్రధాని విదేశీ పర్యటన వివరాలను బగాలే వివరించారు. ఈ నెల 27న నెదర్ల్యాండ్స్ వెళతారని, నెదర్ల్యాండ్స్ రాజుగారితో సమావేశమవుతారని ఆయన అన్నారు. వాషింగ్టన్ డిసికి మోడీ వెళ్లనున్నారని ఆయన చెప్పారు. అవకాశాన్నిబట్టి అమెరికాలోని భారత సంతతితో మోడీ సమావేశమవుతారని ఆయన వెల్లడించారు.