ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు శుభవార్త...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 23, 2020, 12:37 PM

ఏపీ ప్రజలకు సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు రాకపోకలకు సంబంధించి ఇక నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. స్వంత వాహనాల్లో వెళ్లే వారు కూడా అనుమతి పత్రాలు చూయించాల్సిన అవసరం లేదని,స్వేచ్ఛగా వెళ్లవచ్చన్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. అదే విధంగా కారులో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు. అంతా మాస్కులు ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తే మాత్రం ఖచ్చితంగా అనుమతి పత్రాలు ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లినా చెక్ పోస్టుల వద్ద అనుమతి పత్రాలు చూపించాల్సి ఉండేది. ఇక నుంచి ఆ బాధ లేదు. మరో వైపు ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com