ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏటీఎంకు వెళ్లే కస్టమర్లకు ఎస్ బీఐ కీలక సూచనలు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 23, 2020, 12:34 PM

లాక్‌డౌన్ సమయంలో డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎస్ బీఐ కస్టమర్లకు సూచించింది.


-> మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే సమయంలో మీ పిన్ ఎవరూ చూడకుండా జాగ్రత్త వహించాలి.


-> మీ ఏటీఎం పిన్‌ను ఎక్కడా రాయకుండా గుర్తుపెట్టుకోండి.


-> మీ బర్త్ డే, పెళ్లి రోజు, వాహనం నెంబర్ లాంటివి ఎలాంటి పరిస్థితుల్లోనూ పిన్ నెంబర్లుగా పెట్టుకోకండి.


-> ఏటీఎంలో స్కిమ్మింగ్ డివైజ్‌, సీక్రెట్ కెమెరాలు లాంటివి ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి.


-> ఓటీపీ, డెబిట్ కార్డ్ పిన్, మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోకండి.


-> మీ ఏటీఎం పిన్, ఇతర వివరాలు అడుగుతూ ఎవరైనా ఎస్ఎంఎస్, ఈ- మెయిల్ పంపినా, కాల్ చేసినా వివరాలను వెల్లడించకండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com