ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాధి నుండి బయటకు తీసి బాలిక శవంపై అత్యాచారయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 23, 2020, 09:53 AM

మహిళలపై కామాంధుల అకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఏ ఒక్కరికీ రక్షణ లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అస్సాంలోని దెమాజీ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన జరిగింది. 14 ఏళ్ళ బాలిక శవాన్ని సమాధి నుండి బయటకు తీసి అత్యాచారం చేయబోయాడు ఒక మదోన్మాది.ఎస్పీ ధనంజయ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాకు చెందిన ఓ బాలిక(14) ఈనెల 17 న చనిపోయింది. అదే రోజున కుటుంబ సభ్యులు సైమన్ నదీ తీరంలో పూడ్చిపెట్టారు. అకాన్ సైకియా (51) అనే వ్యక్తి ఆ బాలిక సమాధిని తవ్వి శవాన్ని బయటకు తీసి అత్యాచారం చేయబోయాడు. అదే గ్రామానికి చెందిన కొందరు జాలర్లు గమనించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ 306, 377 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. గతంలో నిందితుడికి నేరచరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com