ఏపీ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసింది. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. క్యాట్ నిర్ణయాన్ని కూడా హైకోర్టు పక్కన పెట్టింది.1989 ఏపీ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఆయన ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.దీంతో జగన్ సర్కార్ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. తాజాగా హైకోర్టు ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశాలివ్వడంతో సర్కార్ ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు.