ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 62 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2514కి చేరుకుంది. కరోనాతో ఇప్పటి వరకు ఏపీలో 55 మంది మరణించారు. 1731 మంది కోలుకోని డిశ్చార్జు అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 728 యాక్టివ్ కేసులున్నాయి. నేడు కృష్ణాలో ఒకరు కరోనాతో చనిపోయారు. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను వైద్యశాఖ వెల్లడించలేదు.