ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ల ఓపెన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 22, 2020, 12:28 PM

జూన్ 1 నుంచి నడవనున్న రైళ్లకు సంబంధించి రెగ్యులర్ బుకింగ్ కౌంటర్లను తెరవాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే కూడా తన పరిధిలో ఉన్న 73 స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు ఓపెన్ చేసింది. నేటి నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఆన్ లైన్ తో పాటు ఈ స్టేషన్లలో బుకింగ్స్ చేసుకోవచ్చు. అందులో తెలంగాణలో 19,ఏపీలో 43,కర్ణాటకలో 5, మహారాష్ట్రలో 6 స్టేషన్లలో టికెట్ బుకింగ్స్ జరగనున్నాయి. నేటి నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.


తెలంగాణలో టికెట్ బుకింగ్స్ జరిగే రైల్వే స్టేషన్లివే.


సికింద్రాబాద్, హైదరాబాద్(నాంపల్లి), కాచిగూడ, వికారాబాద్, తాండూర్, ఖాజిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, రామన్నపేట, కామారెడ్డి, నిజామాబాద్,మహబూబ్‌నగర్.


ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ బుకింగ్స్ జరిగే స్టేషన్లివే.


విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట, పిడుగురాళ్ల, నంబూరు, మంగళగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా కెనాల్, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తాడేపల్లిగూడెం, అనపర్తి, పిఠాపురం, అన్నవరం, తుని, నారిపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, రాయనపాడు, కొండపల్లి, చిత్తూరు, కోడూరు, ఒబులవారిపల్లె, పుల్లంపేట్, రాజంపేట్, నందలూరు, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, అధోని, మంత్రాలయం రోడ్, అనంతపూర్, ధర్మవరం.


మహారాష్ట్రలో టికెట్ బుకింగ్స్ జరిగే స్టేషన్లివే.


నాందేడ్, పూర్ణ, పర్భని, సేలు, జల్నా, ఔరంగాబాద్


కర్ణాటకలో టికెట్ బుకింగ్స్ జరిగే స్టేషన్లివే.


సెడమ్, రాయచూర్, సైదాపూర్, నల్వార్, యాద్గిర్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com