ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఆసరాగా వాహనమిత్ర స్కీమ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 11:22 AM

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ కష్టజీవుల పరిస్థితి వర్ణనాతీతం. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి భారంగా బతుకీడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ వీరికి తీపికబురు అందించింది.

వైఎస్సార్ వాహనమిత్ర రెండోవిడత ఆర్ధికసాయం రూ. 10,000 జూన్ 4 నుండి అందిస్తామని తెలిపింది. గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఉపాధిని కోల్పోయి ఆర్ధికంగా అవస్థలు పడుతున్న ఈ సమయంలో ఈ పథకం వీరికి ఊరటను ఇవ్వనుంది. ఆర్ధికంగా జవసత్వాలను కూడగట్టుకునేందుకు ఈ ఆర్ధికసాయం వారికి ఆసరా కానుంది. లాక్ డౌన్ 4 లో కేంద్రం భారీగా సడలింపులు ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లో కూడా రవాణాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జూన్ 4న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ వాహనమిత్ర రెండోవిడత ఆర్థికసాయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ మే 26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేయనున్నారు. గతేడాది లబ్దిపొందిన వారు మళ్లీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదని రవాణాశాఖా మంత్రి పేర్ని నాని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com