Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, May 21, 2020, 11:18 AM
లాక్ డౌన్ కారణంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం లేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు మే 4న యూపీఎస్సీ ప్రకటించింది. తాజాగా యూపీఎస్సీ పరీక్షల తేదీలపై ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలకు సంబంధించి వివరాలు వచ్చే నెల 5న ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సమాచారమిచ్చింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com