కోలకతా : అనారోగ్యంతో బాధ పడుతున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అల్తామస్ కబీర్ (68) మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ కోకతాలోని అపోలో ఆసుప త్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఓ న్యాయ నిష్ణాతుడిని కోల్పో యామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తన ట్వీట్లో పేర్కొన్న మమత ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కాగా, కోకతాలో 1948 జులై 19న ఆయన జన్మించారు. కోకతా యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్ బీ, ఎంఏ పూర్తి చేశారు. 1990లో కోకతా హై కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 మార్చిన జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఆయన పని చేశారు. అదే ఏడాది సెప్టెంబర్లో సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా పదోన్నతి పొందారు.