బర్మింగ్హామ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర పోరు జరగనుంది. యాషెస్ ప్రత్యర్థులు నేడు ఎడ్జ్బాస్టన్లో బ్యాట్లు దూసుకోనున్నారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇప్పటి వరకూ ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు వర్షార్పణం అయ్యాయి. వారు సెమీస్ బరిలో నిలవాలంటే తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఇది. మరోవైపు ఇంగ్లాండ్ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సెమీస్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.