బంగారం ధరలు ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 70 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,030 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు ఏకంగా 50 రూపాయల పెరుగుదలతో 43,030 రూపాయలు నమోదు చేసింది. బంగారం ధరతో పాటూ, వెండి ధరలు కూడా మళ్ళీ పెరిగింది. వెండి ధర కేజీకి 90 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే పైకి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర ఇప్పుడు 40,360 రూపాయలు పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60 రూపాయల పెరుగుదలతో 44,260 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయల పెరుగుదలతో 41,960 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. 40 వేల మార్కు దాటి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,360 రూపాయల వద్దనిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 70 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,030 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 50 రూపాయల పెరుగులతో 44,030 రూపాయలు నమోదు చేసింది. వెండి ధర 40,360 రూపాయలు పలుకుతోంది.