ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో కరోనా టెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 06, 2020, 09:08 AM

ఏపీని కరోనా పరేషాన్ వెంటాడుతోంది. కర్నూలులో ఏకంగా 53 పాజిటివ్ కేసులు నమోదుకావడం సంచలనంరేపుతోంది.. ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాధితుల్లో ఓ రైల్వే ట్రాక్‌మెన్ కూడా ఉండటం కలకలంరేపుతోంది. అతడు ఎవరెవర్ని కలిశాడు.. ఎక్కడ తిరిగాడు అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అతడు గత నెలలో ఢిల్లీ నుంచి కర్నూలు వచ్చినట్లు గుర్తించారు


ట్రాక్‌మెన్ గత నెల 17న రాత్రి 8గంటలకు ఆగ్రా కంటోన్మెంట్‌ స్టేషన్‌ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి 18న రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్‌ వచ్చాడు. తర్వాత 7.10 గంటలకు ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కి 7.30 గంటలకు కాచిగూడ వెళ్లాడు. తర్వాత రాత్రి 8.05 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌‌లో కర్నూలు చేరుకున్నాడు. అక్కడ తన విధులకు హాజరైనట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే కాచిగూడ స్టేషన్‌లో ఉన్న అతడు 35 నిమిషాలు ఎక్కడెక్కడ తిరిగాడనే విషయమై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ప్లాట్‌ఫాంపై టిఫిన్ సెంటర్లు, స్టాళ్లు, అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని అధికారులు సూచించారు. ట్రాక్‌మెన్‌ టిక్కెట్‌ రిజర్వేషన్‌ లేకుండానే కర్నూల్‌కు వెళ్లినట్లుగా తేలిందట. ఎస్‌2, ఎస్‌5 బోగీల్లో ప్రయాణించినట్లు గుర్తించారట.. ఎస్‌5 బోగీలో ప్రయాణించిన 77 మంది జాబితా సేకరించి వివరాలు ఆరా తీస్తున్నారు. వారిలో ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ట్రాక్‌మెన్ రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి పాజిటివ్ రాగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com