ఏపీ సర్కార్ పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1న వార్డు,గ్రామ వాలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్లు అందజేస్తారని తెలిపింది. పెన్షన్లు ఇచ్చేటప్పుడు సాధారణంగా బయో మెట్రిక్ ద్వారా వేలి ముద్రలు లేదా సంతకాలు తీసుకునే వారు. కరోనా వైరస్ ప్రభావంతో సంతకాలు,బయో మెట్రిక్ లేకుండానే పెన్షన్లు అందజేయనున్నారు. పెన్షన్లు తీసుకున్న లబ్ధిదారులకు చెందిన జియో ట్యాగ్ ఫోటోలను గ్రామ,వార్డు వాలంటీర్లు ఫోన్ల ద్వారా తీసుకోనున్నారు. కరోనా ప్రభావంతో ఆర్ధిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లింది. అయినప్పటికి పెన్షన్లు ఆపవద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దాని ప్రకారం అధికారులు పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.