కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో కరోనాపై 21 రోజుల పోరు కొనసాగుతున్న తరుణంలో గురువారం మధ్యాహ్నం 1 గంటకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడన్నారు. ఇటీవల ఆర్థిక ప్యాకేజీ సిద్ధమవుతోందనీ, త్వరలోనే వివరాలను ప్రకటించనున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇప్పటికే పలు విషయాల్లో నిబంధనలను సడలించిన ఆర్థికమంత్రి తాజా సమావేశంపై మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో మార్కెట్లు దృఢంగా కొనసాగుతున్నాయి. ఉపశమన చర్యలతో దేశ ప్రజలకు భారీ ఊరట లభించనుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది.