దేశంలో కిల్లర్ కరోనా విరుచుకుపడుతోంది. తాజాగా దేశరాజధాని ఢిల్లీ నగరంలోని మోహల్లా క్లినిక్ డాక్టర్కు, ఆయన కుటుంబం సభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళకు ఆ డాక్టర్ చికిత్స చేశారు. ఆ మహిళ ద్వారా మోహల్లా క్లినిక్ డాక్టర్కు కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. దీంతో డాక్టర్, డాక్టర్ కుటుంబ సభ్యులు క్లినిక్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో డాక్టర్ వద్ద చికిత్స చేయించుకున్న వారిని గుర్తించే పనిలో ఢిల్లీ ప్రభుత్వం ఉంది.