ఏపీ సీఎం జగన్ కు మరో షాక్ ఎదురైంది. ఏపీ సర్కార్ సస్పెన్షన్ చేసిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ కు క్యాట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఎం జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. గతంలో కృష్ణకిషోర్ ఏపీ ఆర్ధిక మండలి సీఈవోగా పని చేశారు. ఆయన పై అవినీతి ఆరోపణలు రావడంతో సర్కార్ సస్పెన్షన్ చేసింది.
ఈడీబీ సీఈవోగా ఉన్న సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగాలపై ఆయన పై కేసులు పెట్టారు. ఏపీ సీఐడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసింది. దీని పై ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. దీనిని విచారించిన క్యాట్ సస్పెన్షన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణకిషోర్పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చని ఈ సందర్భంగా క్యాట్ పేర్కొంది.