అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 67వ రోజుకు చేరింది. పోలీసుల తీరుకు నిరసనగా రాజధాని గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మద్దతుగా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. అత్యవసర సేవలను మాత్రం బంద్ నుంచి మినహాయించారు. మందడం, తుళ్లూరు, కృష్ణాయపాలెం, ఇతర గ్రామాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు టిడిపి నేతలతో పాటు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.