ఎఐఎంఐఎం నేత వారిస్ పఠాన్పై కలబురగిలో ఎఫ్ఐఆర్ నమోదయింది. శ్వేత అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు. మేరకు పోలీసులు పఠాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సిఎఎ)కు వ్యతిరేకంగా జరిగిన ఒక సభలో పఠాన్ మాట్లాడుతూ 100 కోట్లమంది హిందువులకు తగిన సమాధానం చెప్పడానికి 15 కోట్ల మంది ముస్లింలు చాలని వ్యాఖ్యలు చేశారు.