వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్పై ఆతిధ్య న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే భారత్ను ఆలౌట్ చేసిన కివీస్.. ప్రస్తుతం 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (89, 153 బంతుల్లో; 11×4) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (44, 71 బంతుల్లో; 6×4, 1×6) ఆకట్టుకున్నాడు. మొదటగా కివీస్ బౌలర్లు చెలరేగితే.. ఆపై బ్యాట్స్మన్లు రాణించారు. అయితే తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 165 పరుగులకే ఆలౌటైంది. ఓవరనైట్ స్కోర్ 122/5తో రెండో రోజు ఇన్నింగ్ ఆరంభించిన కోహ్లి సేన మరో 43 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. పట్టుమని 15 ఓవర్లు కూడా టీమిండియాను బ్యాటింగ్ చేయనీయలేదు కివీస్ బౌలర్లు. ఆదుకుంటారని అనుకున్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (138 బంతుల్లో 46; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా, రిషభ్ పంత్ (19)లు తీవ్రంగా నిరాశపరిచాడు.