పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్పై ఎన్జీటీ గురువారం విచారించింది. తెలంగాణలో ముంపు ప్రభావంపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై కమిటీ అధ్యయనం చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. కమిటీ నివేదిక అందిన అనంతరం ఎన్జీటి తదుపరి విచారణ చేపట్టనుంది.