కంటి వెలుగు వైద్యపరిక్షల కేంద్రాన్ని శాసన సభ్యులు మల్లాది విష్ణు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కంటి వెలుగు కార్యక్రమాన్ని రెండు ఫేజులలో నిర్వహించామని అన్నారు. ప్రస్తుతం నేటి నుంచి మూడో ఫేజ్ ప్రారంభం అయినదన్నారు. ప్రతి డివిజన్ లో కంటి పరిక్షలు, ఆపరేషన్ లు అవసరం అయిన వారిని గుర్తించి వారందరికి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలలో ఏర్పాటు చేసిన శిభిరాలకు తరలించి, అవసరం అయిన వారిక ఉచితంగా ఆపరేషన్ లు నిర్వహిస్తున్నామని అన్నారు. మూడో ఫేజ్ మూడు నెలలు ఉంటుందని, అర్హులందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని విష్ణు సూచించారు.