శ్రీకాకుళం జిల్లా మేదరమెట్లలో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర చేశారు. అమరావతిలో ఒకే సామజిక వర్గం ఉందని ప్రచారం చేస్తున్నారు. రాజధానికి 33,500 ఎకరాలు స్వచ్చందంగా ఇవ్వడం ఒక చరిత్ర అని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు విశాఖలో భూములు కొనుగోలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక సరఫరా చేశామని అయన తెలిపారు. ఇప్పుడు ఇసుక ధరలు ఆకాశాన్నంటాయని అన్నారు. వైసీపీ నేతలు అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నారు. జే ట్యాక్స్ కట్టిన బ్రాండ్లే మద్యం షాపుల్లో అమ్ముతున్నారు. టీడీపీ కట్టిన బిల్డింగులకు వైసిపి రంగులు వేస్తున్నారు.