చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాబార్డ్ ఆర్థికసాయం ఇవ్వనున్నది. రూ. 1931 కోట్ల ఆర్థికసాయం చేయడానికి నా బార్డు ముందుకొచ్చింది. చింతలపూడి ఎత్తిపోతలతో కృష్ణా, ప.గో. జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. 410 గ్రామాల్లోని 26 లక్షల మందికి తాగునీరు అందించనున్నది. మార్చి 2022 కు చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కానున్నది.