ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింధియాపై కోపమేమీ లేదు : కమల్‌నాథ్‌

national |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 02:49 PM

కాంగ్రెస్‌ పార్టీలో తన సహచరుడు జ్యోతిరాదిత్య సింధియాపై తనకేమీ కోపం లేదని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అన్నారు. అయితే కమల్‌నాథ్‌ ఉపయోగించిన పదజాలం సింధియా పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా అర్థమవుతోంది. ”నేను ఎవరి పట్లా కోపంగా ఉండను. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌పై నాకు కోపం లేదు. అటువంటప్పుడు సింధియాపై కోపం ఎందుకు ఉంటుంది?” అని ఆయన అన్నారు. కమల్‌నాథ్‌, సింధియాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ఈ వారంలో వారిని కలవాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆదేశించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com