ఫిట్నెస్ సంతరించుకున్న సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ టెస్ట్ జట్టులో పునరాగమనం చేశాడు. ఈనెల 21నుంచి భారత్తో జరిగే తొలి టెస్ట్కు 13 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును సోమవారం ప్రకటించారు. బౌల్ట్తోపాటు పేసర్ జేమిసన్, స్పిన్నర్ అజాజ్ పటేల్కు స్థానం కల్పించారు. మొదటి టెస్ట్ ఈనెల 21న ఇక్కడ ప్రారంభంకానుంది
జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), బ్లండెల్, బౌల్ట్, గ్రాండ్హోమ్, జేమిసన్, లాథమ్, మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, సౌథీ, టేలర్, వాగ్నర్, వాట్లింగ్.