మూడు రాజధానులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని ఆయన అన్నారు. కొన్ని శక్తులు దీనికి అడ్డుపడుతున్నాయని అయన అన్నారు. ఐటీ దాడుల్లో చంద్రబాబు పీఎస్ వద్దే రూ. 2 వేల కోట్లు దొరికాయని అన్నారు. చంద్రబాబు దోపిడీ రూ. లక్షల కోట్లు చేరడం ఆశ్చర్యం ఏమి లేదు అని అన్నారు. దీనిపై పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు అన్నారు.