న్యూఢిల్లీ: ఢిల్లీ ఓటర్ల తీర్పును గౌరవిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్కా లంబా అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మతాలకు అనుగుణంగా జరిగాయని పేర్కొన్నారు. హిందూ, ముస్లింల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని విజయం వరించిందని ఆమె తెలిపారు. చాందినిచౌక్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆల్కాలంబా.. ప్రస్తుతం మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ఫలితాన్ని స్వాగతిస్తున్నానని.. కానీ ఎప్పటికీ వదులుకోనని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న ప్రధాన లక్ష్యం.. విపరీతమైన సమస్య వలయంలో చిక్కుకున్న ప్రజల పక్షాన పోరాడడమేనని తెలిపారు. ఈ రోజు పోరాడితే రేపటి విజయం నీదేనని ఆమె అన్నారు.