ప్రాణాంతక కరోనా వైరస్ భారత్లోనూ క్రమంగా వ్యాపిస్తోంది. కాసేపటి క్రితమే దేశంలో మూడో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. కేరళలోని కాసర్గఢ్లో ఓ వ్యక్తి వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. బాధితుడు ఇటీవల వుహాన్ నుంచి కేరళ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేరళలోనే గతంలో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసుతో కరోనా బాధితుల సంఖ్య భారత్లో మూడుకు చేరింది.