తిరుమల : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తం 13 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి సర్వదర్శనానికి 6గంటలు సమయం పడుతుందని టీటీడీ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఒక్కరోజే 39,541 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే రూ. 2.90 కోట్లు శ్రీవారికి హుండీ ఆదాయం వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇవాళ మధ్యాహ్నం మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 4.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి. రథసప్తమి సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.