సీఎం జగన్కు సలహాలు ఇవ్వడానికి ఎవరికీ ధైర్యం లేదని మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి జరుగుతుంటే మామూలుగా ఇద్దరు మంత్రులు కూడా రారని.. అలాంటిది మండలికి 22 మంది మంత్రులు రావాల్సిన అవసరం ఏముందని యనమల ప్రశ్నించారు. ఓటింగ్ జరుగుతుంటే అంతమంది మంత్రులు మండలికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని మంత్రి నిలదీశారు. ఈ నేపథ్యంలో బిల్లుకు సంబంధించిన మంత్రులు మాత్రం ఉండాలని రూల్ 90 కింద మండలి ఛైర్మన్కు నోటీసు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఏదో విధంగా బిల్లును ఆమోదించుకోవాలని వైకాపా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయం తీసుకోవడానికే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తారని.. అక్కడ దాదాపు మూడు నెలల సమయం పడుతుందని యనమల వివరించారు.