పలు తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, పెదపూడి తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. గుంటూరు జిల్లా భట్టిప్రోలు ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో తహసీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారులు అందుబాటులో లేరు.